'గల్ఫ్లో పనిచేసేవారు తమ వివరాలు అందించాలి'
- May 13, 2017
గల్ఫ్లో పనిచేసే వారు తప్పనిసరిగా తమ వివరాలను అందించాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో విదేశీ సంపర్క్ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, రక్షణ, పాస్పోర్టు తదితర అంశాలపై సమావేశంలో వక్తలు చర్చిస్తున్నారు. భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్కు ఎంతో విశిష్టమైన పేరు ఉందన్నారు.
తెలంగాణలో దాదాపు అన్ని రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి విదేశాలకు ఎక్కువ మంది వలస వెళ్తున్నరన్నారు. ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తమని తెలిపారు. ఈ మైగ్రేట్ పోర్టల్తో ప్రవాస భారతీయులకు లాభం చేకూరుతుందన్నారు. కావునా గల్ఫ్లో పనిచేసేవారు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్రం మంత్రి సూచించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







