'గల్ఫ్‌లో పనిచేసేవారు తమ వివరాలు అందించాలి'

- May 13, 2017 , by Maagulf
'గల్ఫ్‌లో పనిచేసేవారు తమ వివరాలు అందించాలి'

గల్ఫ్‌లో పనిచేసే వారు తప్పనిసరిగా తమ వివరాలను అందించాలని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో విదేశీ సంపర్క్ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీశాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, రక్షణ, పాస్‌పోర్టు తదితర అంశాలపై సమావేశంలో వక్తలు చర్చిస్తున్నారు. భేటీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా వీకే సింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఎంతో విశిష్టమైన పేరు ఉందన్నారు. 

తెలంగాణలో దాదాపు అన్ని రాష్ర్టాల ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి విదేశాలకు ఎక్కువ మంది వలస వెళ్తున్నరన్నారు. ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తమని తెలిపారు. ఈ మైగ్రేట్ పోర్టల్‌తో ప్రవాస భారతీయులకు లాభం చేకూరుతుందన్నారు. కావునా గల్ఫ్‌లో పనిచేసేవారు తప్పనిసరిగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా కేంద్రం మంత్రి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com