షార్జా అగ్ని ప్రమాదంలో కార్మికుడి మృతి
- May 13, 2017
షార్జా హమ్రియా పోర్ట్లో తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఓ షిప్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పందించి, బాధితులకు తగిన సహాయాన్ని అందించాయి. అలాగే మంటల్ని ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న మూడు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ 40 నిమిషాలు అగ్ని కీలలతో పోరాడి, వాటిని అదుపు చేశారు. ప్రమాదం జరిగిన షిప్, డీజిల్ మరియు ఆయిల్ ప్రోడక్ట్స్ని కలిగి ఉంది. అగ్ని కీలలు పోర్ట్లోని ఇతర షిప్లకు వ్యాపించకుండా సకాలంలో ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించారని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. అజ్మన్, ఉమ్ అలఠ్ కువైన్ నుంచి కూడా సివిల్ డిఫెన్స్ టీమ్స్ ఈ ఘటనలో తమ సహాయ సహకారాల్ని అందించాయి. గాయపడ్డ కార్మికుల్ని కువైట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







