దుకాన్‌ హైవేపై యూ టర్న్‌ మూసివేత

- May 13, 2017 , by Maagulf
దుకాన్‌ హైవేపై యూ టర్న్‌ మూసివేత

దుకాన్‌ హైవేపై యూ టర్న్‌ని అష్గల్‌ మూసివేయనుంది. దుకాన్‌ హైవే ఈస్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా అండర్‌ పాస్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి ఈ మూసివేత అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 2018 వరకు ఈ మూసివేత ఉంటుంది. దుకాన్‌ హైవేపై వెస్ట్‌బౌండ్‌ ట్రావెల్‌ చేసేవారు, అమిరి గార్డ్‌ రౌండెబౌట్‌ వరకు వెళ్ళి యూ టర్న్‌ తీసుకోవాలి. రోడ్డు వినియోగదారులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలనీ, అలాగే డైవర్షన్లను గమనించి, ట్రాఫిక్‌ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com