ఉత్తరకొరియా సరిహద్దుల్లో మరో క్షిపణి ప్రయోగం
- May 13, 2017
కొరియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. నేడు ఉత్తరకొరియా మరోసారి ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. దక్షిణకొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ పరీక్షను నిర్వహించడం గమనార్హం. కుసాంగ్ సమీపంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్రజలాల్లో కూలిపోవటం గమనార్హం. గత నెలలో నిర్వహించిన రెండు క్షిపణి పరీక్షలు విఫలం కావడంతో నేటి పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇది ఏ రకం క్షిపణో తెలియాల్సి ఉంది. దీనిపై జపాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ.. ఉత్తరకొరియా తూర్పుతీరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ క్షిపణి కూలిపోయిందని తెలిపారు. ఇది కొత్త శ్రేణికి చెందిన క్షిపణి అని ఆయన తెలిపారు.
దక్షిణకొరియా నూతన అధ్యక్షుడిపై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూన్ ఎన్నికల్లో ఉత్తరకొరియాతో సత్సంబంధాలు పెంచుకుంటానని ప్రచారం చేశారు. నేటి పరీక్షను ఆయన ఖండించారు. ఇదో రెచ్చగొట్టే చర్య అని అభివర్ణించారు. ఉత్తర కొరియాతో చర్చలు చేపట్టాలంటే దాని వైఖరిలో కచ్చితంగా మార్పు రావాలని ఆయన అన్నారు.
ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను అమెరికా పశ్చిమ కమాండ్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఈ క్షిపణికి అమెరికాను భూభాగాన్ని తాకేంత శక్తిలేదని పేర్కొంది. మరో పక్క ఉత్తరకొరియా మిత్ర దేశమైన చైనా ఈ పరీక్షపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









