ఇక పై ఆన్లైన్లోనే ఆధార్, పాన్ కార్డుల్లో మార్పులు
- May 14, 2017
పాన్, ఆధార్ కార్డులోని పేర్లు, ఇతర సమాచారంలో మార్పులు, చేర్పులకు వీలుగా ఆన్లైన్ సౌకర్యాన్ని ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ రెండు కార్డులను ఆన్లైన్ వేదికగా అనుసంధానం కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రిటర్నులు దాఖలు చేసే వెబ్సైట్లోనే ఆదాయపన్ను శాఖ రెండు హైపర్లింక్లను అందుబాటులో ఉంచింది.
ఒకటి పాన్ కార్డు సమాచారంలో మార్పులు లేదా కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం... మరొకటి ఆధార్ కార్డులో వివరాలను మార్చుకునేందుకు ఉద్దేశిం చినది. అయితే, ఆధార్ కార్డులో మార్పులకు ఆధారంగా స్కాన్ చేసిన పత్రాలను పంపిం చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1.22 కోట్ల మందికిపైగా పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు తమ ఆధార్ కార్డును పాన్కార్డుతో అనుసంధానం చేసుకున్నారు. దేశంలో 25 కోట్ల పాన్లు ఉండగా, వీరిలో ఏటా 6 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









