బాలిక కిడ్నాప్ హత్య: వాట్సాప్ రూమర్ మాత్రమే
- May 15, 2017
ఓ బాలిక కిడ్నాప్ చేయబడి, హత్యకు గురైనట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తని ఫేక్ న్యూస్గా రాయల్ ఒమన్ పోలీసులు ధృవీకరించారు. ఏడేళ్ళ బాలికని ఒమన్కి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని, అలా కిడ్నాప్కి గురైన బాలిక విగతజీవిగా దొరికిందని సోషల్ మీడియాలో ఓ వార్త సర్క్యులేట్ అయ్యింది. కిడ్నాప్పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, పోలీసుల విచారణలో బాలిక మృతదేహం దొరికిందని ఆ ఫేక్ వార్తలో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, ఫేక్ న్యూస్ని ప్రచారం చేయడం మంచిది కాదని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు సూచించాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







