బాలిక కిడ్నాప్ హత్య: వాట్సాప్ రూమర్ మాత్రమే
- May 15, 2017
ఓ బాలిక కిడ్నాప్ చేయబడి, హత్యకు గురైనట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తని ఫేక్ న్యూస్గా రాయల్ ఒమన్ పోలీసులు ధృవీకరించారు. ఏడేళ్ళ బాలికని ఒమన్కి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని, అలా కిడ్నాప్కి గురైన బాలిక విగతజీవిగా దొరికిందని సోషల్ మీడియాలో ఓ వార్త సర్క్యులేట్ అయ్యింది. కిడ్నాప్పై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, పోలీసుల విచారణలో బాలిక మృతదేహం దొరికిందని ఆ ఫేక్ వార్తలో పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, ఫేక్ న్యూస్ని ప్రచారం చేయడం మంచిది కాదని రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు సూచించాయి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









