రూ.1,031లకే ఎయిర్‌ఏషియా విమాన టికెట్‌

- May 15, 2017 , by Maagulf
రూ.1,031లకే ఎయిర్‌ఏషియా విమాన టికెట్‌

దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా తన విమానాల్లో ప్రయాణించే వారికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందించనుంది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ప్రారంభ ధర రూ.1,031లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు సెప్టెంబర్‌ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. రాంచి-కోల్‌కతా(రూ.1,220), గోవా-హైదరాబాద్‌(1,237) న్యూదిల్లీ-శ్రీనగర్‌(రూ.2,062) రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఎయిర్‌ఏషియా అందుబాటులో ఉంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com