వెనక్కి జరుగుతున్న ట్రక్కు కింద పడి మృతి చెందిన భారతీయ కార్మికుడు

- May 15, 2017 , by Maagulf
వెనక్కి జరుగుతున్న ట్రక్కు కింద పడి మృతి చెందిన భారతీయ  కార్మికుడు

మనామ: పని చేసేచోట కార్మికులు అప్రమత్తంగా లేకపోతే ఎటువంటి అనర్ధాలు జరుగుతాయో ఈ వార్త రుజువు చేస్తుంది. ఒక నిర్వాసిత కార్మికుడు ఆదివారం ఆస్కార్ లో తాను పని చేసే స్థలంలో తిరోగమన ట్రక్కు కింద పడి నలిగిపోయి మరణించాడు. ప్రవాస భారతీయుడైన మల్లేష్ గవ్వాలా, కాంట్రాక్టు సంస్థతో ఒక కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఆదివారం ఉదయం సుమారు11:30 సమయంలో బహ్రెయిన్ ట్రక్కు డ్రైవర్ ట్రక్కును వెనక్కి నడిపిస్తుండగా అది గమనించని మల్లేష్ వెనకకు జరగుతున్న ట్రక్ కింద పడి నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒక అధికారక సమాచారం ప్రకారం, వెంటనే స్పందించిన బహ్రెయిని డ్రైవర్ మరియు పారామెడిక్ జట్టు తీవ్రంగా గాయపడిన  మల్లేష్ ను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ నిర్వాసిత కార్మికుడు చనిపోయినట్లుగా గుర్తించారు. . ఈ కేసు ప్రస్తుతం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. అంతేకాక కార్మిక మంత్రిత్వశాఖ ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com