తనయుడ్ని హతమార్చిన తల్లికి జైలు
- May 15, 2017
14 నెలల చిన్నారి మృతికి కారకురాలైన కేసులో దుబాయ్కి చెందిన ఓ మహిళకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పదే పదే చిన్నారిని కొట్టడం, ఆ చిన్నారి పొట్ట మీద చేతి వేళ్ళతో బలంగా గుచ్చడం వంటి చర్యలతో తీవ్రమైన బాధతో చిన్నారి విలవిల్లాడిపోయేవాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నిందితురాలి సోదరి సైతం, నిందితురాలికి వ్యతిరేకంగానే విచారణలో వాస్తవాలు వెల్లడించడంతో న్యాయస్థానం నిందితురాలికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. పలుమార్లు ఆ చిన్నారిని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారని, ఆ చిన్నారికి పలు సందర్భాల్లో చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. ఇంకో వైపున నిందితురాలి భర్త లేని సమయంలోనే చిన్నారి బాగా ఏడ్చేవాడనీ, అప్పుడే ఆ చిన్నారిపై దాడులు జరుగుతుండేవని విచారణలో తేలింది. ఓ సందర్భంలో, చిన్నారి పొట్టపై నిందితురాలు గట్టిగా చేతితో గుచ్చడాన్ని తానుకూడా చూసినట్లు మెయిడ్ విచారణలో తెలిపింది. అంతర్గత రక్తస్రావంతోనే చిన్నారి మృతి చెందాడనీ, దానికి కారణం పొట్టపై బలంగా గుచ్చడమేనని వైద్యులు తేల్చారు. అయితే తన క్లయింటు ఎలాంటి కుట్రపూరిత చర్యకు పాల్పడలేదని నిందితురాలి తరఫు లాయర్ వాదించినా, న్యాయస్థానం పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన విషయాలను పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







