సందీప్ కిషన్ తో దర్శకుడు వంశీకృష్ణ
- May 15, 2017
'దొంగాట', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ . ఇప్పుడీ దర్శకుడి చేతిలో మరో సినిమా పడింది. హీరో సందీప్ కిషన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు వంశీ కృష్ణ. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ అందిస్తున్నట్లు దర్శకుడు వంశీకృష్ణ వెల్లడించాడు, ప్రసన్న కుమార్ గతంలో 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' చిత్రాలకు కథను అందించిన సంగతి తెల్సిందే. ఆర్డీజీ ప్రొడక్షన్ ప్రై.లి పతాకంపై రూపేశ్ డి గోహిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజార్ షఫి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో నక్షిత్రం చేస్తున్నాడు సందీప్ కిషన్ ఈ సినిమా విడుదలైన వెంటనే కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ కొత్త సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







