మెగాస్టార్ చిరు చిత్రంతో రాములమ్మ రీ ఎంట్రీ
- May 16, 2017
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఎక్కడా కూడా లోపం జరగకుండా పక్కా సమాచారంతో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనుండగా రామ్ చరణ్ నిర్మించనున్నాడు. 'ఉయ్యాaవాడ' స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి ఈ చిత్రంపై పaువురు డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అసభ్యకరంగా తెరకెక్కిస్తే ఊరుకునేది లేదు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే యూనిట్ సభ్యులు ఈ చిత్రం కోసం పక్కా ప్లాన్ను తయారు చేస్తున్నారు.
స్క్రిప్టు పరంగా ఓ వైపు చాలా సీరియస్గా చర్చలు జరుగుతండగా నటీనటుల విషయం కూడా హాట్ టాఫిక్గా మారింది. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అధికారికంగా ఫిక్స్ కాలేదు. అయితే 'ఉయ్యాలవాడ'కు ముగ్గురు భార్యలు ఉండేవారు అని వార్తలు ప్రచారం అయ్యాయి. మరి ఈ చిత్రంలో ముగ్గురిని చూపిస్తారా లేదా బడ్జెట్ ఎక్కువ అవుతుందని తగ్గిస్తారా అనేది ఇంకా తెలియదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంతో రాములమ్మ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది అని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. గతంలో చిరు, విజయశాంతిలు కలిసి ఎన్నో చిత్రాలలో జతగా నటించగా ఈ చిత్రం ద్వారనే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అనేది చిత్ర యూనిట్ అధికారిక ప్రకటించే వరకు ఎదురుచూడాల్సిందే.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









