వలసదారుడి అదృశ్యం

- May 17, 2017 , by Maagulf
వలసదారుడి అదృశ్యం

పదేళ్ళ క్రితమే బహ్రెయిన్‌కి వచ్చిన భారతీయ వలసదారుడు గుసర్మీత్‌ సింగ్‌, అదృశ్యమవడం పట్ల ఆందోలన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. మూడేళ్ళుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్మీత్‌ సింగ్‌ ఆచూకీ కోసం విచారణ వేగవంతం చేశారు. వ్యవసాయ కార్మికుడిగా పనిచేసేందుకు గుర్మీత్‌, బహ్రెయిన్‌కి వచ్చినట్లు తెలియవస్తోంది. తన యజమాని వద్ద కాకుండా ఇంకొకరి వద్ద ఉండటంతో, అతని పాస్‌పోర్ట్‌, వీసా చెల్లే అవకాశం లేదు. గతంలో గుర్మీత్‌ నుంచి అప్పుడప్పుడూ ఫోన్‌ కాల్‌ వచ్చేదనీ, అప్పుడప్పుడూ డబ్బు కూడా పంపించేవారనీ, మూడేళ్ళ నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్‌ సింగ్‌కి ఇద్దరు పిల్లలున్నారు. గుర్మీత్‌కౌర్‌ భార్య నిర్మల్‌ కౌర్‌, తన భర్త ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com