వన్ టైమ్ యూజ్ మొబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం
- May 17, 2017
దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా, వన్ టైమ్ ఒబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. వాటిని వినియోగించడం, అమ్మకంపైనా నిషేధం ఉంటుందని చెప్పారాయన. పబ్లిక్ హెల్త్ మరియు కమ్యూనిటీ సేఫ్టీలో భాగంగా ఈ డిక్రీని తీసుకొచ్చారు. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రెధా సల్మాన్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఈ ఛార్జర్ల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, ఆ కారణంగానే వీటిని బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జర్ల కారణంగా ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుందని వివరించారు. ఈ తరహా ఛార్జర్లను ఇకపై ఎవరూ ఇంపోర్ట్ చేయరాదనీ, విక్రయించరాదనీ, కొనుగోలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల్ని లెక్కచేయనివారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









