వన్‌ టైమ్‌ యూజ్‌ మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లపై నిషేధం

- May 17, 2017 , by Maagulf
వన్‌ టైమ్‌ యూజ్‌ మొబైల్‌ ఫోన్‌ ఛార్జర్లపై నిషేధం

దుబాయ్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ హుస్సేన్‌ నాజర్‌ లూటా, వన్‌ టైమ్‌ ఒబైల్‌ ఫోన్‌ ఛార్జర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. వాటిని వినియోగించడం, అమ్మకంపైనా నిషేధం ఉంటుందని చెప్పారాయన. పబ్లిక్‌ హెల్త్‌ మరియు కమ్యూనిటీ సేఫ్టీలో భాగంగా ఈ డిక్రీని తీసుకొచ్చారు. హెల్త్‌ అండ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ రెధా సల్మాన్‌ మాట్లాడుతూ, పర్యావరణానికి ఈ ఛార్జర్ల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, ఆ కారణంగానే వీటిని బ్యాన్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జర్ల కారణంగా ఎలక్ట్రానిక్‌ వేస్టేజ్‌ ఎక్కువైపోతుందని వివరించారు. ఈ తరహా ఛార్జర్లను ఇకపై ఎవరూ ఇంపోర్ట్‌ చేయరాదనీ, విక్రయించరాదనీ, కొనుగోలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల్ని లెక్కచేయనివారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com