వన్ టైమ్ యూజ్ మొబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం
- May 17, 2017
దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా, వన్ టైమ్ ఒబైల్ ఫోన్ ఛార్జర్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. వాటిని వినియోగించడం, అమ్మకంపైనా నిషేధం ఉంటుందని చెప్పారాయన. పబ్లిక్ హెల్త్ మరియు కమ్యూనిటీ సేఫ్టీలో భాగంగా ఈ డిక్రీని తీసుకొచ్చారు. హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రెధా సల్మాన్ మాట్లాడుతూ, పర్యావరణానికి ఈ ఛార్జర్ల వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, ఆ కారణంగానే వీటిని బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఈ ఛార్జర్ల కారణంగా ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఎక్కువైపోతుందని వివరించారు. ఈ తరహా ఛార్జర్లను ఇకపై ఎవరూ ఇంపోర్ట్ చేయరాదనీ, విక్రయించరాదనీ, కొనుగోలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల్ని లెక్కచేయనివారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







