యూకేలోని మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ
- May 18, 2017
యూకేలోని ఓ భారతీయ రెస్టారెంట్లో మనిషి మాంసం వండుతున్నారని ఫేక్ వార్త కలకల రేపింది. దీంతో ఆ హోటల్ మూత పడింది. నాన్వెజ్ వంటకాల పేరిట మనిషి మాంసం వడ్డిస్తున్నారంటూ ఫేస్బుక్లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. దీనిపై స్పందించిన 'కర్రీ ట్విస్ట్' రెస్టారెంట్ యాజమాన్యం తమ వ్యాపారాన్ని దెబ్బతీసేందుకే కొందరు గిట్టని వ్యక్తులు ఇలా చేశారని చెప్పారు.
నకిలీ వార్తను నమ్మిన కొందరు దాడి చేసేందుకు హోటల్పైకి రాగా.. పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. గత 60 ఏళ్లుగా రెస్టారెంట్ నడుపుతున్నామని ఇలాంటి సంఘటన ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ఓ ఫేక్ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన వార్తను ఎలా నమ్మారో తెలీడం లేదని అన్నారు. కేవలం ఒక కాలమ్.. దాని నిండా స్పెల్లింగ్ మిస్టెక్స్ ఉన్నాయని వార్తను గురించి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









