హైదరాబాద్ మక్కామసీద్లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు
- May 18, 2017
చార్మినార్ మక్కామసీద్లో పేలుళ్లు జరిగి ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అదనపు బలగాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. అడిషనల్ సీపీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 2 కంపెనీల ఆర్ఏఎఫ్ బలగాలు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. 2007లో మక్కామసీద్లో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పదేళ్లైన నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో హైఎలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







