హైదరాబాద్ మక్కామసీద్లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు
- May 18, 2017
చార్మినార్ మక్కామసీద్లో పేలుళ్లు జరిగి ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అదనపు బలగాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. అడిషనల్ సీపీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 2 కంపెనీల ఆర్ఏఎఫ్ బలగాలు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. 2007లో మక్కామసీద్లో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పదేళ్లైన నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో హైఎలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









