హైదరాబాద్ మక్కామసీద్లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు
- May 18, 2017
చార్మినార్ మక్కామసీద్లో పేలుళ్లు జరిగి ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అదనపు బలగాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. అడిషనల్ సీపీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 2 కంపెనీల ఆర్ఏఎఫ్ బలగాలు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. 2007లో మక్కామసీద్లో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పదేళ్లైన నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో హైఎలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!









