హైదరాబాద్ మక్కామసీద్‌లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు

- May 18, 2017 , by Maagulf
హైదరాబాద్ మక్కామసీద్‌లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు

చార్మినార్ మక్కామసీద్‌లో పేలుళ్లు జరిగి ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.  అదనపు బలగాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. అడిషనల్ సీపీ  స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 2 కంపెనీల ఆర్‌ఏఎఫ్ బలగాలు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. 2007లో మక్కామసీద్‌లో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పదేళ్లైన నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో హైఎలర్ట్ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com