రమదాన్ కు ముందుగా తనిఖీలను కఠినతరం చేసిన కువైట్ మునిసిపాలిటీ
- May 19, 2017
ముఖ్యంగా రమదాన్ సమీపించే నాటి నుండి కువైట్ మునిసిపాలిటీ, దుకాణాల పర్యవేక్షణలను కఠినతరం చేసింది. ఆయా దుకాణదారులను పర్యవేక్షించడం మరియు వినియోగదారులతో నేరుగా వ్యవహరించి వారికి ఆహారాన్ని అమ్ముతుండే వ్యాపారులపై తనిఖీలు నిర్వహించాలని మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడు మరియు సాంకేతిక కమిటీ ఛైర్మన్ ఫహ్ద్ అల్-సేన్ పిలుపునిచ్చారు. ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగిన కారణంగా కొందరు కార్మికులు ఎంతటి ఖర్చుకైనా వెనకాడటంలేదని దీనితో ఆహార దుకాణ వ్యాపారులు పవిత్ర నెలను వారికి లాభసాటిగా మార్చుకొంటున్నారని ఆయన అన్నారు. వినియదారులను మోసగించడం లేదా మానవ వినియోగం కోసం అసమర్థమైన వస్తువుల అమ్మకం విషయంలో వినియోగదారుల ఫిర్యాదులను స్వీకరించడానికి మునిసిపాలిటీ హాట్లైన్లను సక్రమం చేయాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







