అతివేగమే ప్రాణాలను తీసిందని ధృవీకరించిన బెంజ్ ప్రతినిధులు
- May 19, 2017
బాప్రే!.. అంత వేగమా?.. అంటూ నిషిత్ కారు ప్రమాదంపై బెంజ్ కంపెనీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. ఎపి మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ కారు యాక్సిడెంట్ పై పరిశీలించేందుకు జర్మనీ నుంచి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ ప్రతినిధులు జూబ్లీహిల్స్లోని యాక్సిడెంట్ స్పాట్ ను, నుజ్జునుజ్జయిన కారుని పరిశీలించారు. జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పుణెకు చెందిన బెంజ్ కార్ల నిపుణులు, ఓ లీగల్ అడ్వైజర్తో కూడిన పదిమంది సభ్యుల బృందం ప్రమాదం తీరుని పరిశీలించింది. ప్రమాదం జరిగిన సమయలో కారు 210 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ట్రాఫిక్లో అంతవేగం ఎలా సాధ్యపడిందని ఆరా తీయగా, తెల్లవారుజామున కావడంతో ట్రాఫిక్ ఉండదని పోలీసులు వారికి వివరించారు. మెట్రో పిల్లర్ నిర్మాణం, మూలమలుపు, వర్షం కురిసిన సమయంలో రోడ్డు పరిస్థితి తదితర వివరాలను మెట్రో అధికారుల నుంచి సేకరించారు. కారు వేగం గంటకు 80-120 కిలోమీటర్ల మధ్య ఉన్నట్టయితే ఆయన బతికే అవకాశం ఉండేదని, కారులోని సెక్యూరిటీ సిస్టం, ఎయిర్బ్యాగ్స్, సీటు బెల్టులు సరిగానే పనిచేస్తున్నాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









