3 యూఏఈ న్యాయ సంస్థలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
- May 19, 2017
దుబాయ్: యూఏఈకి చెందిన మూడు న్యాయ సంస్థలు ప్రతిష్టాత్మక మిడిల్ ఈస్ట్ లీగల్ అవార్డ్స్ని గెలుచుకున్నాయి. దుబాయ్లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా న్యాయవాదులు హాజరయ్యారు. లండన్కి చెందిన బిజినెస్ లా న్యస్ వెబ్సైట్, లీగల్ వీక్ - అసోసియేషన్ ఆఫ్ కార్పొరేట్ కౌన్సెల్ మిడిల్ ఈస్ట్ చాప్టర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. అమెరికన్ లఆయర్ సంస్థ సహాయ సహకారాలు అందించింది. డీన్ స్టెల్ఫాక్స్, జనరల్ కౌన్సెల్, దుబాయ్ వరల్డ్ సెంటర్ అవార్డుల ప్యానెల్ జడ్జిలుగా వ్యవహరించారు. హదెఫ్ అండ్ పార్టనర్స్ కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. బాకర్ మెకన్జీ హబీబ్ అల్ ముల్లా లిటిగేషన్ టీమ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. అల్ తమిమి అండ్ కంపెనీ - రీజినల్ లా ఫర్మ్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలో పురస్కారం గెలుచుకుంది. ఈ పురస్కారాలు దక్కడం పట్ల ఆయా సంస్థల ప్రతినిథులు హర్షం వ్యక్తం చేశారు. మెరుగైన న్యాయసేవలు అందించడంలో తమ తమ సంస్థలు ప్రత్యేక చొరవ చూపిస్తున్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









