ఉద్యోగార్థుల కోసం బ్యాక్గ్రౌండ్ చెక్ కఠినతరం
- May 19, 2017
బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి ఉద్యోగాల కోసం వెళ్ళేవారికి బ్యాక్గ్రౌండ్ చెక్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ రాయబారి ముహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు. క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే వర్క్ వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కఠిన నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు. యూఏఈలో బంగ్లాదేశీ వ్యక్తులు పలు నేరాలకు పాల్పడుతున్న దరిమిలా, బ్యాక్గ్రౌండ్ చెక్ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో మొత్తం 700,000 నుంచి 800,000 వరకు బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. ఎంబసీ లెక్కల ప్రకారం చూస్తే 700 నుంచి 800 మంది యూఏఈ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు వివిధ నేరాలకు సంబంధించి. 2014లో ఖైదీల అప్పగింత సహా పలు విషయాలపై ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 2015లో యూఏఈ, ఢాకాలో వీసా సెంటర్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







