ఉద్యోగార్థుల కోసం బ్యాక్గ్రౌండ్ చెక్ కఠినతరం
- May 19, 2017
బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి ఉద్యోగాల కోసం వెళ్ళేవారికి బ్యాక్గ్రౌండ్ చెక్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ రాయబారి ముహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు. క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే వర్క్ వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కఠిన నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు. యూఏఈలో బంగ్లాదేశీ వ్యక్తులు పలు నేరాలకు పాల్పడుతున్న దరిమిలా, బ్యాక్గ్రౌండ్ చెక్ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో మొత్తం 700,000 నుంచి 800,000 వరకు బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. ఎంబసీ లెక్కల ప్రకారం చూస్తే 700 నుంచి 800 మంది యూఏఈ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు వివిధ నేరాలకు సంబంధించి. 2014లో ఖైదీల అప్పగింత సహా పలు విషయాలపై ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 2015లో యూఏఈ, ఢాకాలో వీసా సెంటర్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









