ఉద్యోగార్థుల కోసం బ్యాక్గ్రౌండ్ చెక్ కఠినతరం
- May 19, 2017
బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి ఉద్యోగాల కోసం వెళ్ళేవారికి బ్యాక్గ్రౌండ్ చెక్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ రాయబారి ముహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు. క్రైమ్ రేట్ తగ్గించడానికీ, అలాగే వర్క్ వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కఠిన నిర్ణయాల్ని తమ ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన తెలిపారు. యూఏఈలో బంగ్లాదేశీ వ్యక్తులు పలు నేరాలకు పాల్పడుతున్న దరిమిలా, బ్యాక్గ్రౌండ్ చెక్ విషయంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించడంపై దృష్టిపెట్టినట్లు ఆయన వివరించారు. యూఏఈలో మొత్తం 700,000 నుంచి 800,000 వరకు బంగ్లాదేశీ వలసదారులు నివసిస్తున్నారు. ఎంబసీ లెక్కల ప్రకారం చూస్తే 700 నుంచి 800 మంది యూఏఈ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్నారు వివిధ నేరాలకు సంబంధించి. 2014లో ఖైదీల అప్పగింత సహా పలు విషయాలపై ఇరు దేశాల మధ్యా ఒప్పందం కుదిరింది. 2015లో యూఏఈ, ఢాకాలో వీసా సెంటర్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









