బహ్రెయిన్ లో అక్రమ నిధి సేకరణ, నగదు బదిలీ కేసులో ఇరువురు వ్యక్తులకు జైలు
- May 21, 2017
మనామా: అక్రమ నిధుల సేకరణ, క్రిమినల్ నేరాల ద్వారా పొందిన నగదు బదిలీ. కేసులో ఒక నిందితుడు,మరో మతపరమైన వ్యక్తితో సహా, ఒకొక్కరికి సంవత్సరం జైలుశిక్ష పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయస్థానం తన తీర్పును ఆదివారం జారీ చేసింది, ఈ కేసుకు సంబంధించిన నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక ఒకొక్క ముద్దాయికి 100,000 బహ్రెయిన్ డినార్ల జరిమానాను సైతం కోర్టు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకసారి రెండు తీర్పులు అమలు చేయాలని ఆ నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టడానికి అడ్వకేట్ జనరల్ సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆపై స్వాధీనం చేసుకున్న ఆస్తులను జప్తు చేయడంతో సహా, న్యాయస్థానం సూచించిన ఆదేశాలు అమలు చేస్తుంది. అదేవిధంగా న్యాయ సంబంధిత షరియా కమిటీ పర్యవేక్షణలో సంబంధిత ప్రాంతాల్లో స్వచ్ఛంద మరియు మానవతా ప్రయోజనాల దృష్ట్యా వాటిని పంపిణీ చేయడంతో చట్టబద్ధంగా బాధ్యత గల సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రస్తుతం అప్పీల్ చేస్తుందా లేదా అనేది నిర్ధారించడానికి తీర్పులను పరిశీలిస్తున్నట్లు న్యాయవాది జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









