ప్రమాదాలను చిత్రీకరిస్తే జరిమానా విధించే చట్టం

- May 21, 2017 , by Maagulf
ప్రమాదాలను చిత్రీకరిస్తే జరిమానా విధించే చట్టం

మనామ: మీడియా వ్యక్తులు మినహా సాధారణ వ్యక్తులు ట్రాఫిక్ ప్రమాదాలను చిత్రీకరించి అదేదో ఘనకార్యం మాదిరిగా ఆనందపడితే, ఏకంగా జైల్లోకి వెళ్ళి తాపీగా విచారించే విధంగా కొత్త చట్టాలు రాబోతున్నాయి. ఎంపీలు కనుక ఆమోదించినట్లయితే ప్రతినిధుల సభ దానిపై విదేశీ వ్యవహారాల, రక్షణ మరియు జాతీయ భద్రతా సంఘం తయారుచేసిన నివేదికను పరిశీలిస్తుంది మరియు దీనిపై సమగ్రంగా చర్చించనుంది. గత సంవత్సరం ఇదే విషయంపై ఎంపి మొహమ్మద్ అల్ మరీఫి నుంచి ఒక ప్రతిపాదనను కమిటీ స్వీకరించింది, ట్రాఫిక్ ప్రమాదాలు జరిగినపుడు వీడియోలు తీయడం, ప్రచారం కల్పించే వారికి జరిమానా మరియు జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినపుడు  గుర్తింపు పొందిన మీడియా   వ్యక్తుల మినహాయించి వేరేవారెవరకి ఆ అధికారం లేదని కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. "ఈ ప్రతిపాదన, ప్రమాదాల యొక్క ప్రదేశాల్లో జన సమూహాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ట్రాఫిక్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది, వాటిని చిత్రీకరించడానికి మరియు ఆన్లైన్లో ఆ సమాచారమును  ఆన్లైన్లో ఇతరులతో పంచుకోవడానికి వీలు లేదు. ఇతరుల అనుమతి తీసుకోకుండా అవతలివారి గోప్యతను  పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించరాదని సూచించింది వ్యక్తుల చిత్రాలు వారి ఇష్టానికి వ్యతిరేకంగా పంపిణీ చేయబడతాయి మరియు దాని గురించి తెలియకుండానే "కమిటీ సభ్యులు దాని నివేదికలో వివరించారు," సవరణ కూడా గుంపుకు దారితీసే ట్రాఫిక్ అంతరాయం కలుగజేస్తుంది "అని పేర్కొంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు మానవ హక్కుల జాతీయ సంస్థ వంటి పలు అధికారులతో దీనిని సమీక్షించిన తరువాత, కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించింది, పైన పేర్కొన్న సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి ఆరు నెలలు మించకుండా జైలుశిక్ష, 50 బహెరిన్ దీనార్ నుంచి 500 బహెరిన్ దీనార్ వరకు జరిమానా విధించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com