మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం

- May 22, 2017 , by Maagulf
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఘనంగా నివాళులర్పించింది. ఆ మహోన్నత వ్యక్తికి అరుదైన సత్కారాన్ని ఇచ్చి తన గౌరవాన్ని రెట్టింపు చేసుకుంది.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తమ శాస్త్రవేత్తలు గుర్తించిన ఓ నూతన జీవికి కలాం పేరు మీదుగా నామకరణం చేసింది.  బ్యాక్టీరియా రకానికి చెందిన ఈ జీవి భూమిపై ఎప్పుడూ కనిపించలేదు.  నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఐఎస్ఎస్ ఫిల్టర్లపై ఈ నూతన జీవిని తొలిసారిగా గుర్తించారు.  ఏరోస్పేస్ రంగంలో కలాం సేవలకు గుర్తింపుగా ఆ బ్యాక్టీరియాకు సొలిబాసిల్లస్ కలామైగా నామకరణం చేసినట్లు జేపీఎల్ సీనియర్ శాస్త్రవేత్త కస్తూరీ వెంకటేశ్వరన్ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com