ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర
- May 23, 2017
‘భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేయడానికి పథకం రెడీగా ఉంది. త్వరలోనే ఆయన ముంబైలో ఓ ర్యాలీలో పాల్గొంటారు.. అదనుచూసి దాడిచేద్దాం..’ అంటూ ఓ అగంతకుడు చేసిన ఫోన్కాల్ కలకలం రేపుతోంది. తాను పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నానని, మోదీ హత్యకు సహకరిస్తే రూ.50కోట్లు ఇస్తానని ఆగంతకుడు చెప్పాడు. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన కుషాల్ సోనీకి ఇటీవలే +79651219 నంబర్ నుంచి కాల్ వచ్చింది. తననుతాను పాకిస్థానీగా పరిచయం చేసుకున్న అగంతకుడు.. మోదీని హత్యకు సహకరించాలని కుషాల్ను అడిగాడు. కంగారుపడుతూనే కాల్ను రికార్డ్ చేసిన కుషాల్.. నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఈ వ్యవహారంపై సాత్నా జిల్లా ఎస్పీ మిత్లేశ్కుమార్ స్పందించారు. కుషాల్ అందించిన నంబర్ను పరిశీలించామని, అయితే అది పాకస్థాన్నుంచి వచ్చిందికాదని, కజకిస్థాన్ నుంచి వచ్చిందని చెప్పారు. కాల్ రికార్డింగ్ను పరిశీలిస్తున్నామన్న ఆయన.. ఇది ఆకతాయిలపనా? లేక మరొకటా అనేదానిపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









