ఎన్నారై కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న గ్లోబల్‌ లీడర్స్‌

- May 23, 2017 , by Maagulf
ఎన్నారై కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న గ్లోబల్‌ లీడర్స్‌

నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ బహ్రెయిన్‌లో నవంబర్‌ 24 నుంచి 26 వరకు జరగనుంది. గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్గనైజేషన్‌ మూడు దశాబ్దాల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభమయ్యింది. బహ్రెయిన్‌లో నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రస్తుత మరియు మాజీ ప్రధాన మంత్రులు, హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌, బిజినెస్‌ లీడర్స్‌ వంటి ప్రముఖులు సుమారు 40 దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. గల్ఫ్‌ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొననుండడం గమనార్హం. డాక్టర్‌ శశి థరూర్‌, లార్డ్‌ బిల్లిమోరియా, శివ్‌ ఖెరా, ఫిజి మాజీ ప్రధాన మంత్రి చౌదరి తదితరులు కీనోట్‌ స్పీకర్లుగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు. పూర్తి వివరాలు 14 నవంబర్‌న బహ్రెయిన్‌ చాప్టర్‌ మీటింగ్‌లో ఖరారు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com