మొత్తం మీద దిగి వచ్చిన పసిడి ధర

- May 23, 2017 , by Maagulf
మొత్తం మీద  దిగి వచ్చిన పసిడి ధర

గత కొంత కాలంగా పెరుగుతూ పోయిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. మంగళవారం 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.235 తగ్గి రూ.29వేలకు దిగువకు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు ఉండటం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ టేడ్రింగ్ వర్గాలు తెలిపారు. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.28,915 పలికింది. ఇటు బంగారం ధర తగ్గుతుంటే వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.315 పెరిగి, రూ.39,815కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 0.02శాతం తగ్గి 1,260.10 డాలర్లు పలికింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com