మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం
- May 23, 2017
మనామా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, స్పెషలిస్టుల బృందం మీట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. మనామా, ముహరాక్ మీట్ సెంట్రల్ మార్కెట్స్లో ఈ బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. మనుషులు సేవించడానికి వీలుగా మీట్ ఉందా? లేదా? అనే అంశాలపై ఈ బృందం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుందని అధికారులు తెలిపారు. హెల్త్ మరియు వర్క్స్, మునిసిపలిటీస్ అండ్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ సంయుక్తంగా ఈ క్యాంపెయిన్ని చేపడుతున్నాయి. అధికారిక స్లాటర్ హౌస్ల ద్వారా మాత్రమే మాంసం కొనుగోలు చేపట్టాలంటూ మాంసం విక్రయదారులకు అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు తావివ్వరాదని, తేడాలు గుర్తిస్తే మాత్రం కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









