కుల్భూషణ్ జాధవ్ అరెస్ట్ విషయం లో పాకిస్తాన్కు భారీ షాక్
- May 23, 2017
పాకిస్తాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదళ అధికారి కుల్భూషణ్ జాధవ్ను తమ దేశంలోనే అరెస్ట్ చేశామని చెబుతున్న పాకిస్తాన్ మాటలు అబద్దమని తేలిపోయింది. జాధవ్ను ఇరాన్లో పట్టుకున్నామని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ అధికారి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అంజాద్ షోయబ్ వెల్లడించారు. జాధవ్ను తమ దేశంలో అరెస్ట్ చేయలేదని ఆయన తెలిపారు.
అతడిని బలూచిస్తాన్లో అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. ఇరాన్ నుంచి తమ దేశంలోకి చొరబడుతుండగా గతేడాది మార్చి 3న అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. ఐఎస్ఐ మాజీ అధికారి ప్రకటనతో దాయాది దేశానికి దిమ్మతిరిగినట్టైంది. నావికాదళం నుంచి పదవీ విరమణ చేసిన ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న జాధవ్ను కిడ్నాప్ చేసి అతడిపై పాక్ గూఢచర్యం ఆరోపణలు మోపిందని భారత్ పేర్కొంది.
మరోవైపు జాధవ్ కేసుపై త్వరగా విచారణ చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) పాకిస్తాన్ అభ్యర్థించింది. జాధవ్కు పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్కు ఐసీజే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని పాక్ కోరుతోంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







