మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగి 34 మంది శరణార్థులు మృతి
- May 24, 2017
రోమ్, మే 24: మధ్యదరాసముద్రంలో ఓ నౌక మునిగిపోయిన ఘటనలో 34 మంది శరణార్థులు మృతి చెందారు. వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. నౌకలో సామర్థ్యానికి మించి శరణార్థులు ప్రయాణిస్తుండటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని ఇటాలియన్ కోస్ట్కార్డ్ ప్రతినిధి ఒకరు బుధవారం తెలిపారు. లిబియా తీరప్రాంతానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 34 మృతదేహాలను వెలికితీశామని, దాదాపు 200 మంది ప్రజలు సముద్రంలో పడిపోయారని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 నుంచి 700 మంది వరకు శరణార్థులు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, శరణార్థులకు లైఫ్జాకెట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









