80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!

- March 09, 2026 , by Maagulf
80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!

మస్కట్: గత వారంలో దాదాపు 80 అదనపు విమానాలను నడిపినట్లు ఒమన్ ఎయిర్ తెలిపింది. దాదాపు 97వేల మందికి పైగా ప్రయాణికులు స్వదేశానికి తిరిగి రావడానికి సహాయపడినట్లు ప్రకటించింది.

 “వైమానిక స్థావరం మూసివేత కారణంగా పరిమిత సంఖ్యలో ప్రాంతీయ మార్గాలు తాత్కాలికంగా ప్రభావితమైనప్పటికీ..యూరప్, ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికాలో విస్తరించి ఉన్న మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో ఎక్కువ భాగం ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది.  సాధ్యమైన చోట అదనపు ఫ్రీక్వెన్సీలను జోడిస్తూనే ఉన్నాము.” అని ఒమన్ ఎయిర్ ఒక ప్రకటనలో తెలిపింది.

యూఏఈ నుండి ఒమన్‌కు భూ సరిహద్దు దాటే ప్రయాణికులకు ఫ్లైట్ సర్వీసులను పొందేందుకు వీలుగా ఎయిర్ పోర్టు వరకు బస్సు సర్వీసులను కూడా అందుబాటులో పెట్టినట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com