కువైట్ లో కడప వాసి మృతి
- May 24, 2017
ఎడారి దేశంలో అడుగుపెట్టిన ప్రవాసాంధ్రులు.. కంపెనీలు మూత పడడంతో అక్కడే ఉండలేక.. తిరగి రాలేక నానాపాట్లు పడుతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే కన్నుమూశాడు. మరణించే సమయానికి వీసా కూడా లేకపోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత అతడి మృతదేహం స్వదేశానికి వచ్చింది. కడప జిల్లా నగిరిపాడు గ్రామానికి చెందిన పెద్దబుద్ది లక్ష్మీకర్ దశాబ్దానికిపైగా కువైట్లో ఓ నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీ రెండేళ్ల క్రితం బ్లాక్ లిస్ట్లో పడింది. దీంతో అతడు రోడ్డున పడ్డాడు. ఇటీవలే లక్ష్మీకర్ రెసిడెన్సీ వీసా గడువు కూడా పూర్తయింది. మరోవైపు కొన్ని నెలలుగా అతడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వీసా రెన్యువల్ చేయించుకోలేక..
కనీసం స్వస్థలానికి రాలేక తీవ్ర మనోవేదనతో అనారోగ్యం పాలయ్యాడు. గత నెల 29న గుండెపోటుతో మరణించాడు. వీసా లేకపోవడం, ఇతర అధికార లాంఛనాలు పూర్తి కావడానికి చాలా సమయం తీసుకోవడంతో దాదాపు నెల రోజుల తర్వాత బుధవారం తెల్లవారు జామున లక్ష్మీకర్ మృతదేహాన్ని చెన్నైకు పంపారు. ఈ మేరకు కువైట్లోని రాయలసీమ ప్రవాసీ సంక్షేమ మండలి అధ్యక్షుడు దుగ్గి గంగాధర్ తెలిపారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









