టీడీపీ మహానాడు వేదికగా 8 తీర్మానాలు చేసిన నేతలు
- May 24, 2017
తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన మహానాడులో పాల్గొని పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. మొత్తం 8 తీర్మానాలు చేశారు. కార్యకర్తలే పార్టీ బలమన్న చంద్రబాబు.. తన సుదీర్ఘ ప్రసంగంలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తా కొదమసింహంలా పోరాడాలన్నారు. తెలంగాణ టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ జెండాను ఆవిష్కరించిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ మహానాడును ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమైక్య రాష్ట్రంలో కంటే మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. కార్యకర్తలే తన బలమన్న బాబు టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందన్నారు. కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
చంద్రబాబు హయాంలో నిర్మించిన సైబరాబాద్ వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. టీడీపీని పేదల జీవితాల్లో వెలుగు నింపిన పార్టీగా వర్ణించారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరవీరుల్ని ఆదుకుంటామని, లక్ష ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన సీఎం ఇప్పటివరకూ వాటిని ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలన్నారు. మహానాడు వేదికపై పార్టీ నేతలు మొత్తం ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలతో సహా ఐదు పార్టీ విధానాలపై నేతలు చర్చించారు. పొత్తుల గురించి, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఆచితూచి ప్రసంగించిన చంద్రబాబు రాబోయే రోజుల్లో కేడర్ను బలోపేతం చేసి తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నేతలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసి... సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేయాలన్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









