ముంబై లో దారుణం తల్లి గొంతు కోసి.. నన్ను ఉరితీయమని ఆమె రక్తం తో లేఖ రాసిన కొడుకు
- May 24, 2017
పస్తుతం ఏ రిలేషన్ కు భద్రత లేదు.. తల్లిని బిడ్డ చంపడానికి వెనుకాడడం లేదు.. బిడ్డ తనను నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసింది అనే భావన లేకుండా చిన్న చిన్న కారణాలకు చంపడానికి ఆలోచించడం లేదు.. తాజాగా ఓ రాక్షసుడు తన తల్లిని గొంతు కోసి చంపేసి.. ఆమె రక్తంతో నేలపై ఓ నొత్ కూడా రాశాడు.. పైగా తల్లిని చంపిన కిరాతకుడు ఓ ఫేమస్ ఇన్ స్పెక్టర్ తనయుడు కావడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే...
షీనా బోరా హర్యా కేసును దర్యాప్తు చేస్తోన్న బృందంలోని ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ గనోర్, భార్య దీపాలి, కొడుకు తూర్పు శాంతాక్రజ్లోని ప్రభాత కాలనీలో ఉంటున్నారు. బుధవారం ఉదయం ఆయన డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తలుపు బయట నుంచి తాళం వేసి ఉంది. తాళం చెవులు షూ ర్యాక్లో కనిపించాయి. దీంతో తాళం తీసి లోపలికి వెళ్లి చూసిన ఆయన నిశ్చేష్టుడయ్యాడు. భార్య రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. తెగిన గొంతు నుంచి ఉబికిన నెత్తురు కాలువలు కట్టింది. వెంటనే ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి భార్యను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు..కాగా తల్లిని గొంతు కోసి రక్తంతో ఆ గదిలో నేలపై 'నేను ఆమెతో విసిగిపోయాను. నన్ను పట్టుకుని ఉరి తీయండి' అని రాయడంతో ఈ హత్యను చేసింది జ్ఞానేశ్వర్ కొడుకే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనుమానితుడిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ తనయుడు మంగళవారం రాత్రి నుంచి పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ను ఇంట్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







