ముంబై లో దారుణం తల్లి గొంతు కోసి.. నన్ను ఉరితీయమని ఆమె రక్తం తో లేఖ రాసిన కొడుకు
- May 24, 2017
పస్తుతం ఏ రిలేషన్ కు భద్రత లేదు.. తల్లిని బిడ్డ చంపడానికి వెనుకాడడం లేదు.. బిడ్డ తనను నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి పెద్ద చేసింది అనే భావన లేకుండా చిన్న చిన్న కారణాలకు చంపడానికి ఆలోచించడం లేదు.. తాజాగా ఓ రాక్షసుడు తన తల్లిని గొంతు కోసి చంపేసి.. ఆమె రక్తంతో నేలపై ఓ నొత్ కూడా రాశాడు.. పైగా తల్లిని చంపిన కిరాతకుడు ఓ ఫేమస్ ఇన్ స్పెక్టర్ తనయుడు కావడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే...
షీనా బోరా హర్యా కేసును దర్యాప్తు చేస్తోన్న బృందంలోని ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ గనోర్, భార్య దీపాలి, కొడుకు తూర్పు శాంతాక్రజ్లోని ప్రభాత కాలనీలో ఉంటున్నారు. బుధవారం ఉదయం ఆయన డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తలుపు బయట నుంచి తాళం వేసి ఉంది. తాళం చెవులు షూ ర్యాక్లో కనిపించాయి. దీంతో తాళం తీసి లోపలికి వెళ్లి చూసిన ఆయన నిశ్చేష్టుడయ్యాడు. భార్య రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. తెగిన గొంతు నుంచి ఉబికిన నెత్తురు కాలువలు కట్టింది. వెంటనే ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి భార్యను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు..కాగా తల్లిని గొంతు కోసి రక్తంతో ఆ గదిలో నేలపై 'నేను ఆమెతో విసిగిపోయాను. నన్ను పట్టుకుని ఉరి తీయండి' అని రాయడంతో ఈ హత్యను చేసింది జ్ఞానేశ్వర్ కొడుకే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనుమానితుడిగా భావిస్తున్న జ్ఞానేశ్వర్ తనయుడు మంగళవారం రాత్రి నుంచి పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ను ఇంట్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









