యోగా దినోత్సవం: మస్కట్ లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్
- May 25, 2017
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతి ఇండియన్ ఎంబసీలోనూ ఓ యోగా టీచర్ని ఏర్పాటు చేసి, సంవత్సరమంతా యోగా సెషన్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 69/131 రిజల్యూషన్స్ని ఆమోదించింది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేస్తూ. మస్కట్లో ఇండియన్ ఎంబసీ ప్రతి ఏడాదీ, ఒమన్కి చెందిన యోగా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమిస్తూ వస్తోంది. 3000 మంది ఒమనీయులు, ఇండియన్స్, ఇతర దేశాలకు చెందినవారితో కలిసి భారీ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా ఘనంగా ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









