యోగా దినోత్సవం: మస్కట్ లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్
- May 25, 2017
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతి ఇండియన్ ఎంబసీలోనూ ఓ యోగా టీచర్ని ఏర్పాటు చేసి, సంవత్సరమంతా యోగా సెషన్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 69/131 రిజల్యూషన్స్ని ఆమోదించింది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేస్తూ. మస్కట్లో ఇండియన్ ఎంబసీ ప్రతి ఏడాదీ, ఒమన్కి చెందిన యోగా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమిస్తూ వస్తోంది. 3000 మంది ఒమనీయులు, ఇండియన్స్, ఇతర దేశాలకు చెందినవారితో కలిసి భారీ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా ఘనంగా ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









