ఆంధ్ర,తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
- May 26, 2017
హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమఖం పట్టే అవకాశం ఉందని విశాఖలోని వాతవరణకేంద్రం తెలిపింది. ఈనెల 30, 31లోపు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం కారణంగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుసే అవకాశం ఉందని, తెలంగాణలో వడగాల్పులు కొనసాగువచ్చని అధికారులు తెలిపారు.
కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా తుమ్మడం గ్రామంలోని ఓ తోటలో పిడుగుపాటుకు ఉస్మాన్(55) అనే వ్యక్తి మృతిచెందాడు. కర్నూలు జిల్లా శ్రీశైలం, విశాఖపట్నం జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా దర్శిలో పిడుగుపాటుకు ఓ మహిళ మరణించింది. వైఎస్పార్ జిల్లా కాశినాయన, కలసపాడు మండలల్లో పిడుగుపాటుకు మూడు గేదెలు మృతిచెందాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









