రద్రమదేవి చిత్రానికి స్పందించిన రాజమౌళి

- October 08, 2015 , by Maagulf
రద్రమదేవి చిత్రానికి స్పందించిన రాజమౌళి

అనుష్క ప్రధాన పాత్రలో కాకతీయుల చరిత్రతో రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణా ప్రభుత్వం పన్ను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. తెలంగాణా ప్రభుత్వం రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడం సంతోషించాల్సిన పరిణామం. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రం తెలుగు జాతికి గర్వకారణం అంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. తెలంగాణా ప్రభుత్వం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపునించాలని కోరాడు. రద్రమదేవి చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. దర్శకుడు గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 70కోట్ల వ్యయంతో రూపొందించాడు. ఇళయరాజ సంగీతాన్నందించాడు. రుద్రమదేవి చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదాల మీద వాయిదా పడుతూ, అన్ని అవాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రుద్రమ దేవిగా అనుష్క, చాళక్య వీర భద్రుడిగా రానా, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com