రద్రమదేవి చిత్రానికి స్పందించిన రాజమౌళి
- October 08, 2015
అనుష్క ప్రధాన పాత్రలో కాకతీయుల చరిత్రతో రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణా ప్రభుత్వం పన్ను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. తెలంగాణా ప్రభుత్వం రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడం సంతోషించాల్సిన పరిణామం. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రం తెలుగు జాతికి గర్వకారణం అంటూ ట్విట్టర్లో తెలిపాడు. తెలంగాణా ప్రభుత్వం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపునించాలని కోరాడు. రద్రమదేవి చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. దర్శకుడు గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 70కోట్ల వ్యయంతో రూపొందించాడు. ఇళయరాజ సంగీతాన్నందించాడు. రుద్రమదేవి చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదాల మీద వాయిదా పడుతూ, అన్ని అవాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రుద్రమ దేవిగా అనుష్క, చాళక్య వీర భద్రుడిగా రానా, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









