వలసదారులకు క్షమాభిక్ష లేదు
- May 29, 2017
కువైట్:వీసా / రెసిడెన్సీ నిబంధనల్ని ఉల్లంఘించిన వలసదారులకు ఎలాంటి క్షమాభిక్ష లేదనీ, క్షమాభిక్షపై సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ వార్తల్ని నమ్మరాదని కువైట్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్షమాభిక్ష ప్రకటించిందనీ, వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనులకు ఇదే మంచి అవకాశమని సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఇండియన్ కమ్యూనిటీ ఈ విషయాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరి ట్రాప్లోనూ పడరాదని ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తి చేసింది. సుమారుగా 29,000 మంది భారత జాతీయులు, కువైట్లో వీసా, రెసిడెన్సీ ఉల్లంఘనల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సాయం అందించేందుకు ఇండియన్ ఎంబసీ, లోకల్ అథారిటీస్తో కలిసి చర్యలు చేపడుతోంది. ఇంకో వైపున, కువైట్కి వచ్చేవారు, కువైట్లో ఉంటోన్న భారతీయులు ఖచ్చితంగా కువైటీ చట్టాలను, నిబంధనలను అనుసరించి నడుచుకోవాలని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







