బాంబుల నిర్వీర్యం కోసం డ్రోన్ల వినియోగం
- May 30, 2017
దుబాయ్: డ్రోన్లకు వాటర్ కెనాన్లు వినియోగించి, బాంబుల నిర్వీర్యం కోసం ఉపయోగిస్తామని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఇదంతా రిమోట్ పద్ధతిలో జరగనుంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి ఓడన్ అండ్ వాటర్ కెనాన్ దుబాయ్ పోలీస్ - బాంబ్ స్క్వాడ్లో చేరుతున్నట్లు వెల్లడించారు. వారంట్ ఆఫీసర్ క్లాస్ 1 హమాద్ రషీద్ అల్ ఫెల్సాయ్ మరియు ఫస్ట్ సర్జంట్ మొహమ్మద్ సులైమాన్ అల్ బెలౌషి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. పది నిమిషాల పాటు ఈ డ్రోన్ వాటర్ కెనాన్ గాల్లో ఎగురుతుందని, ప్రపంచంలోనే ఈ విభాగంలో ఇది మొదటి ప్రయోగమని అల్ బెలౌషి చెప్పారు. బాంబుల్ని నిర్వీర్యం చేయడం కోసం కొత్త విధానాల గురించి ఆలోచిస్తున్నప్పుడు డ్రోన్లు గుర్తుకు వచ్చాయని అల్ ఫెలాసి చెప్పారు. బరువు కారణంగా మొదట్లో ప్రయోగాలు విఫలమయ్యాయనీ, పలు విధాలుగా పరిశోధించి సమర్థవంతంగా పనిచేసే వాటర్ కెనాన్ డ్రోన్లను తయారు చేశామని అల్ బెలౌషి వివరించారు. మేజర్ జనరల్ అల్ మెర్రి, ఈ కొత్త ఆవిష్కరణ నేపథ్యంలో అభినందలతో ముంచెత్తారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









