బాంబుల నిర్వీర్యం కోసం డ్రోన్ల వినియోగం
- May 30, 2017
దుబాయ్: డ్రోన్లకు వాటర్ కెనాన్లు వినియోగించి, బాంబుల నిర్వీర్యం కోసం ఉపయోగిస్తామని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఇదంతా రిమోట్ పద్ధతిలో జరగనుంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి ఓడన్ అండ్ వాటర్ కెనాన్ దుబాయ్ పోలీస్ - బాంబ్ స్క్వాడ్లో చేరుతున్నట్లు వెల్లడించారు. వారంట్ ఆఫీసర్ క్లాస్ 1 హమాద్ రషీద్ అల్ ఫెల్సాయ్ మరియు ఫస్ట్ సర్జంట్ మొహమ్మద్ సులైమాన్ అల్ బెలౌషి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. పది నిమిషాల పాటు ఈ డ్రోన్ వాటర్ కెనాన్ గాల్లో ఎగురుతుందని, ప్రపంచంలోనే ఈ విభాగంలో ఇది మొదటి ప్రయోగమని అల్ బెలౌషి చెప్పారు. బాంబుల్ని నిర్వీర్యం చేయడం కోసం కొత్త విధానాల గురించి ఆలోచిస్తున్నప్పుడు డ్రోన్లు గుర్తుకు వచ్చాయని అల్ ఫెలాసి చెప్పారు. బరువు కారణంగా మొదట్లో ప్రయోగాలు విఫలమయ్యాయనీ, పలు విధాలుగా పరిశోధించి సమర్థవంతంగా పనిచేసే వాటర్ కెనాన్ డ్రోన్లను తయారు చేశామని అల్ బెలౌషి వివరించారు. మేజర్ జనరల్ అల్ మెర్రి, ఈ కొత్త ఆవిష్కరణ నేపథ్యంలో అభినందలతో ముంచెత్తారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







