ప్రముఖ దర్శకుడు దాసరి అంత్యక్రియలు పూర్తి
- May 31, 2017
హైదరాబాద్: దర్శకరత్న, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్ మండలం తోల్కట్ట వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య దాసరి సతీమణి పద్మ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియల్ని పూర్తిచేశారు.
మంగళవారం రాత్రి దాసరి మరణవార్త తెలుసుకొని తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీరు మున్నీరైంది. ఆయనను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం దాసరి భౌతికకాయాన్ని ఇంటి నుంచి ఫిలింఛాంబర్కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి మొయినాబాద్లోని దాసరి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!









