షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- April 24, 2026
యూఏఈ: షార్జాలోని అల్ ధైద్ ప్రాంతంలో లైసెన్స్ లేని గోడౌన్ పై అధికారులు దాడి చేసి 13 టన్నులకు పైగా పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అల్ ధైద్ నగర మునిసిపాలిటీలోని ప్రజారోగ్య శాఖలోని ఆహార నియంత్రణ విభాగం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీల సందర్భంగా ఈ చట్టవిరుద్ధ గోడౌన్ ను గుర్తించారు.
అవసరమైన లైసెన్సులు లేకపోవడంతోపాటు ఆమోదించబడిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించకుండా భారీ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. 13 టన్నుల 170 కిలోగ్రాముల పాడైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, అనంతరం ధ్వంసం చేశారు. ఆహార సంస్థలు మరియు గోడౌన్లు ఆరోగ్య నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్ చెకింగ్స్ తోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్









