షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- April 24, 2026
యూఏఈ: షార్జాలోని అల్ ధైద్ ప్రాంతంలో లైసెన్స్ లేని గోడౌన్ పై అధికారులు దాడి చేసి 13 టన్నులకు పైగా పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అల్ ధైద్ నగర మునిసిపాలిటీలోని ప్రజారోగ్య శాఖలోని ఆహార నియంత్రణ విభాగం నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో తనిఖీల సందర్భంగా ఈ చట్టవిరుద్ధ గోడౌన్ ను గుర్తించారు.
అవసరమైన లైసెన్సులు లేకపోవడంతోపాటు ఆమోదించబడిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించకుండా భారీ పరిమాణంలో ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్లు ఇన్స్పెక్టర్లు కనుగొన్నారు. 13 టన్నుల 170 కిలోగ్రాముల పాడైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, అనంతరం ధ్వంసం చేశారు. ఆహార సంస్థలు మరియు గోడౌన్లు ఆరోగ్య నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. రెగ్యులర్ చెకింగ్స్ తోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







