రస్ అల్ ఖైమా ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 01, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో, తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పారామెడిక్స్ అండ్ రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ తీవ్రగాయాలతో అతను మృతి చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









