రస్ అల్ ఖైమా ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 01, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో, తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పారామెడిక్స్ అండ్ రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ తీవ్రగాయాలతో అతను మృతి చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







