రస్ అల్ ఖైమా ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 01, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో, తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పారామెడిక్స్ అండ్ రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ తీవ్రగాయాలతో అతను మృతి చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









