నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం

- June 02, 2017 , by Maagulf
నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం

మండే ఎండలలో శ్రమజీవులు ఇది ఓ  చల్లని వార్త ..నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కార్మికులకు మధ్యాహ్నం పూట మూడు గంటల పాటు విరామం అమలు జరగనుంది. గురువారం ( నిన్నటి ) నుండి ఇది అమలులోకి వచ్చినట్లు  మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ నెల మొదలుకొని ఆగస్టు వరకు ఈ విరామం మూడు నెలల పటు  మధ్యాహ్నం 12 :30 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు వరకు ఈ విరామం కొనసాగుతుంది. ఈ విరామం ద్వారా కార్మికులకు  వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడం మరియు వేడి కారణంగా శారీరక అలసట, వడదెబ్బ  మరియు కండరాల తిమ్మిరి వంటి పలు రోగాల నుండి కార్మికులను కాపాడేందుకు ఈ మధ్యాహ్నం మూడుగంటల విరామం మంత్రిత్వ శాఖ చేత అమలు చేయబడుతుంది.అధిక ఉష్ణోగ్రతకు గురయ్యే ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికుల అందరికి  మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com