నిన్నటి నుండి మూడు గంటల పాటు మధ్యాహ్న విరామం
- June 02, 2017
మండే ఎండలలో శ్రమజీవులు ఇది ఓ చల్లని వార్త ..నిర్మాణాలు జరిగే ప్రాంతాలలో మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో కార్మికులకు మధ్యాహ్నం పూట మూడు గంటల పాటు విరామం అమలు జరగనుంది. గురువారం ( నిన్నటి ) నుండి ఇది అమలులోకి వచ్చినట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. జూన్ నెల మొదలుకొని ఆగస్టు వరకు ఈ విరామం మూడు నెలల పటు మధ్యాహ్నం 12 :30 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకు వరకు ఈ విరామం కొనసాగుతుంది. ఈ విరామం ద్వారా కార్మికులకు వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడం మరియు వేడి కారణంగా శారీరక అలసట, వడదెబ్బ మరియు కండరాల తిమ్మిరి వంటి పలు రోగాల నుండి కార్మికులను కాపాడేందుకు ఈ మధ్యాహ్నం మూడుగంటల విరామం మంత్రిత్వ శాఖ చేత అమలు చేయబడుతుంది.అధిక ఉష్ణోగ్రతకు గురయ్యే ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని కార్మికుల అందరికి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







