అసిడిటి పోవాలంటే చాలా ఈజీ.. ఎలా
- June 03, 2017
ఈ మధ్యకాలంలో ఎసిడిటితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఎసిటిడితో బాధపడేవారికి తక్షణం తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయంటున్నారు కొంతమంది డాక్టర్లు. వీటిని తూచా తప్పకుండా వాడితే తప్పకుండా ఉపశమనం లభిస్తుందంటున్నారు.
పాలల్లో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి పాలు తీసుకోవడంతో కడుపులో ఉన్న యాసిస్ ను తొందరగా గ్రహించి ఎసిడిటి రాకుండా కాపాడుతుంది. బాగా ఎసిడిటితో బాధపడేవారు ఒక పావు కప్పు చల్లటి పాలను తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చట. తులసి ఆకులు అల్సస్ కారకానికి మంచి మందు. ఎసిడిటితో బాధపడేవారు ఐదు నుంచి ఆరు తులసీ ఆకులను బాగా నమిలి ఆ రసం మింగితే ఎసిడిటి నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రతిరోజు 5 నుంచి ఆరు తులసీ ఆకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరటిపండులో పొటాషియం, హైబర్ ఉంటాయి కాబట్టి అరటిని తింటే కడుపులోని యాసిస్ను తొందరగా నివారించి తొందరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. ఎసిడిటి ఉన్న వారు నిత్యం ఒక అరటిపండు తింటే ఎసిడిటి పడకుండా ఉంటారు. ఎసిడిటి ఉన్నవారికి తక్షణ ఉపశమనం కొబ్బరినీళ్ళు. ప్రతిరోజు రెండుగ్లాసుల కొబ్బరినీళ్ళు తాగేవారికి ఎసిడిటి దరిచేరదట. కొబ్బరి నీళ్ళు కడుపులో ఉన్న మిగిలిన యాసిస్ ను పోగొడుతుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ మనకు సులువుగా దొరుకుతుంది కాబట్టి వీటిని వాడడం చాలా ఈజీ.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







