థాయిలాండ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్
- June 04, 2017
హైదరాబాద్: థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన తెలుగు తేజం సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్స్లో జొనాథన్ క్రిస్టీపై 17-21, 21-18, 21-19తేడాతో విజయం సాధించాడు.
థాయ్లాండ్ ఓపెన్: ఫైనల్కు దూసుకెళ్లిన సాయి ప్రణీత్, సైనా ఓటమి
గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయి ప్రణీత్ తాజాగా థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ విజేతగా నిలిచాడు. దీంతో 43 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
2013లో కిడాంబి శ్రీకాంత్ ఈ టైటిల్ను సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది. కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్ ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్పన్ (థాయ్లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19-21, 18-21తో ఓడిపోయింది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









