థాయిలాండ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్

- June 04, 2017 , by Maagulf
థాయిలాండ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్

హైదరాబాద్: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన తెలుగు తేజం సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ పైనల్స్‌లో జొనాథన్‌ క్రిస్టీపై 17-21, 21-18, 21-19తేడాతో విజయం సాధించాడు.
థాయ్‌లాండ్ ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన సాయి ప్రణీత్, సైనా ఓటమి
గత నెలలో సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన సాయి ప్రణీత్ తాజాగా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. దీంతో 43 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
2013లో కిడాంబి శ్రీకాంత్‌ ఈ టైటిల్‌ను సాధించాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది. కాగా, మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ సైనా నెహ్వాల్‌ ప్రపంచ 13వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బామ్‌రుంగ్‌పన్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19-21, 18-21తో ఓడిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com