థాయిలాండ్ ఓపెన్ లో చరిత్ర సృష్టించిన సాయి ప్రణీత్
- June 04, 2017
హైదరాబాద్: థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన తెలుగు తేజం సాయి ప్రణీత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ పైనల్స్లో జొనాథన్ క్రిస్టీపై 17-21, 21-18, 21-19తేడాతో విజయం సాధించాడు.
థాయ్లాండ్ ఓపెన్: ఫైనల్కు దూసుకెళ్లిన సాయి ప్రణీత్, సైనా ఓటమి
గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయి ప్రణీత్ తాజాగా థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ విజేతగా నిలిచాడు. దీంతో 43 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
2013లో కిడాంబి శ్రీకాంత్ ఈ టైటిల్ను సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది. కాగా, మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్ ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్పన్ (థాయ్లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19-21, 18-21తో ఓడిపోయింది.
తాజా వార్తలు
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!









