ఆర్ ఎ ఎఫ్ బృందం నిర్వహణలో 32 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు
- June 05, 2017
షేక్ థానీ బిన్ అబ్దుల్లా ఫౌండేషన్ మానవీయ సేవల నుండి వైద్య బృందం కజాఖ్స్తాన్ రాజధాని అస్తానాలో 32 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను నిర్వహించింది. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య సేవలను అందించడానికి ఆర్ ఎ ఎఫ్ యొక్క "అల్ ఖుల్బ్ అల్ సఘైరా" (చిన్ని హృదయాలు ) పేరిట ఈ ప్రాజెక్ట్ కొనసాగింది. వైద్య బృందం మే 13 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు కజాఖ్స్తాన్లో శస్త్రచికిత్స పూర్తి చేయడానికి 11 రోజుల సమయం పట్టింది. అస్తనాలోని నేషనల్ సైంటిఫిక్ మెడికల్ సెంటర్లో చిల్డ్రన్స్ హార్ట్ సర్జరీ హాస్పిటల్లో ఈ గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించబడింది. లబ్ధిదారుల జీవితాలను కాపాడటానికి విరాళాల ద్వారా కతర్లో ప్రజలు 450,000 కతర్ రియాళ్ళ ప్రాజెక్టు వ్యయంకు ఆ నిధులు సమకూర్చారు. శస్త్రచికిత్స, ఎండోస్కోపీ, అనస్థీషియా మరియు ఇంటెన్సివ్ కేర్లో 20 మంది నిపుణులతో కూడిన ఆర్ ఎ ఎఫ్ వైద్య బృందం మొత్తం 12 ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు మరియు 20 కార్డియాటిక్ కాథెటరిసేషన్లతో సహా మొత్తం 32 కార్యకలాపాలను నిర్వహించింది.అదనంగా ,కజాఖ్స్తాన్ నుండి సుమారు 40 మంది వైద్య సిబ్బంది ఆచరణాత్మక అనుభవాన్ని పొందటానికి సందర్శన వైద్య బృందంతో పరస్పరం సంప్రదించడానికి అవకాశాన్ని పొందారు. ఈ ప్రణాళిక కజాఖ్స్తాన్లో ఆర్ ఎ ఎఫ్ యొక్క స్థానిక భాగస్వామి అల్ బరాకా ఫౌండేషన్తో సహకారంతో అమలు చేయబడింది."దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని పిల్లల సమస్యలను మేము సేకరించామని" అల్ బరాకా ఫౌండేషన్ డైరెక్టర్ బాగ్దాష్ చెప్పారు. ఈ శస్త్రచికిత్సలు నాలుగు రోజుల వయస్సు నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు జరిపేరు. నేషనల్ సైంటిఫిక్ మెడికల్ సెంటర్ పిల్లల హార్ట్ సర్జరీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ షహ్రత్ మార్సాలోవ్ మాట్లాడుతూ, మొదటి సారి ఇటువంటి వైద్య పథకం అమలు చేయబడినదని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









