పల్లీ బర్పీ
- June 07, 2017
కావలసిన పదార్థాలు
వేగించిన పల్లీలు- పావు కిలో, చక్కెర- 150 గ్రా., కుంకుమ పువ్వు- చిటికెడు, నెయ్యి- ఒక టేబుల్ స్పూను, బాదం, పిస్తాలు- అర కప్పు, నీళ్లు- రెండు గ్లాసులు.
తయారీ విధానం
వేగించిన పల్లీలను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలిలో చక్కెర, నీళ్లు పోసి పాకం పట్టాలి. తర్వాత ఉండకట్టకుండా చెంచాతో కలుపుతూ పల్లీల పొడి వేయాలి. పొడి పాకంలో బాగా కలిసిపోయి చిక్కబడిన తర్వాత నెతిలో వేగించిన బాదం, పిస్తాలు, కుంకుమ పువ్వు వేసి దించేయాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని సమానంగా పోసి చల్లారిన తర్వాత నచ్చిన ఆకారంలో కత్తిరించుకోవాలి.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









