కార్మికుల శ్రేయస్సే ముఖ్యం-ఖతార్
- October 11, 2015
ఖతార్ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఖతార్ ఛాంబర్ మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్తో కలిసి దోహాలో ఓ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల నివాస, పని సౌకర్యాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు ఖతార్ ఛాంబర్ వైస్ ఛైర్మన్ మహమ్మద్ బిన్ తువార్ చెప్పారు. దేశంలో 85 శాతం మంది కార్మికులేననీ, వివిధ రంగాల్లో వారు పనిచేస్తున్నారని, దేశం యొక్క స్థిరమైన అభివృద్ధికి వారు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు బిన్ తువార్. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకోసం వివిధ సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్రతినిథులు వెల్లడించారు. ఖతార్ అభివృద్ధి వెనుక ఖతార్ చాంబర్ కృషి ఎంతో ఉందని కార్మిక మరియు సోషల్ ఎఫైర్స్ మంత్రి డాక్టర్ అబ్దుల్లా సలేహ్ ముబారక్ అల్ ఖులైఫి చెప్పారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









