కార్మికుల శ్రేయస్సే ముఖ్యం-ఖతార్

- October 11, 2015 , by Maagulf
కార్మికుల శ్రేయస్సే ముఖ్యం-ఖతార్

ఖతార్‌ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఖతార్‌ ఛాంబర్‌ మరియు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయీస్‌తో కలిసి దోహాలో ఓ మీటింగ్‌ నిర్వహించారు. కార్మికుల నివాస, పని సౌకర్యాలే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్లు ఖతార్‌ ఛాంబర్‌ వైస్‌ ఛైర్మన్‌ మహమ్మద్‌ బిన్‌ తువార్‌ చెప్పారు. దేశంలో 85 శాతం మంది కార్మికులేననీ, వివిధ రంగాల్లో వారు పనిచేస్తున్నారని, దేశం యొక్క స్థిరమైన అభివృద్ధికి వారు చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు బిన్‌ తువార్‌. కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకోసం వివిధ సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎంప్లాయీస్‌ ప్రతినిథులు వెల్లడించారు. ఖతార్‌ అభివృద్ధి వెనుక ఖతార్‌ చాంబర్‌ కృషి ఎంతో ఉందని కార్మిక మరియు సోషల్‌ ఎఫైర్స్‌ మంత్రి డాక్టర్‌ అబ్దుల్లా సలేహ్‌ ముబారక్‌ అల్‌ ఖులైఫి చెప్పారు. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com