అమృత్ సరి చేప
- June 10, 2017
కావాల్సిన పదార్థాలు
చేప - 300 గ్రాములు, అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టీస్పూన్, వాము - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ముప్పావు టీస్పూన్, కసూరి మెంతి - అర టీస్పూన్, తందూరీ మసాలా - ముప్పావు టీస్పూన్, బిర్యానీ మసాలా - పావు టీస్పూన్ (అవసరమనుకుంటే), ఆమ్చూర్ - చిటికెడు, నిమ్మరసం - ఒక టీస్పూన్, శెనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్ స్పూన్లు (ఆవనూనె అయితే రుచి బాగా వస్తుంది)
తయారీ విధానం:
శెనగపిండిని నూనె లేకుండా పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. పిండి రంగు మారకుండా జాగ్రత్తపడాలి.
చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి నచ్చిన సైజ్లో కోయాలి.
ఈ ముక్కలకి వాము, శెనగపిండి, నూనె తప్పించి మిగతా అన్ని పదార్థాలను పట్టించాలి.
వెడల్పాటి పాన్లో నూనె వేడిచేయాలి. అందులో వాము వేసి అది చిటపటమనేవరకు ఉంచాలి. ఇందులో నానబెట్టిన చేపముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద నాలుగు నిమిషాలు ఉంచాలి. తరువాత రెండో వైపు తిప్పి మరో ఐదు నిమిషాలు వేగించాలి.
ముక్కల మీద ఒకవైపు మాత్రం శెనగపిండి చల్లాలి. వేగించేటప్పుడు పిండి మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
ముక్కల్ని రెండోవైపు తిప్పి మళ్లీ వేగించాలి. ఒకవైపు చల్లిన శెనగపిండే రెండు వైపులకు సరిపోతుంది. అవసరమనుకుంటే మంట కాస్త పెంచుకోవచ్చు. ముక్క సరిగా ఉడికేలా వేగించాలి.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







