రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం
- October 12, 2015
మంగళవారం నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఖరారు చేశారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి-మన నీరు, పుట్టమట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్ధనల మధ్య కలశాల ఊరేగింపు ఉంటుంది. అలాగే 15వ తేదీ రాత్రి మండల కేంద్రాలకు కలశాలు వెళతాయి. ఇక 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వతేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాల ఊరేగింపు ఉంటుంది. 19వ తేదీ కల్లా రాజధాని అమరావతికి కలశాలు చేరతాయి. 20, 21 తేదీలలో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. కాగా... ఆ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజవర్గానికో ఇంచార్జిని నియమించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







