రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం

- October 12, 2015 , by Maagulf
రేపటి నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం

మంగళవారం నుంచి అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఖరారు చేశారు. 13, 14, 15 తేదీలలో మన మట్టి-మన నీరు, పుట్టమట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్ధనల మధ్య కలశాల ఊరేగింపు ఉంటుంది. అలాగే 15వ తేదీ రాత్రి మండల కేంద్రాలకు కలశాలు వెళతాయి. ఇక 16, 17 తేదీలలో మండల కేంద్రాలలో కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వతేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాల ఊరేగింపు ఉంటుంది. 19వ తేదీ కల్లా రాజధాని అమరావతికి కలశాలు చేరతాయి. 20, 21 తేదీలలో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. కాగా... ఆ కార్యక్రమాల పర్యవేక్షణకు నియోజవర్గానికో ఇంచార్జిని నియమించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com