కరువు పీడిత సోమాలియాకి ఇండియన్ గ్రూప్ చేయూత
- June 13, 2017
కరువతో తల్లడిల్లుతున్న సోమాలియాకి యూఏఈ బేస్డ్ ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్సి) ద్వారా ఓ ఇండియన్ ఆర్గనైజేషన్ 100,000 దిర్హామ్ల విలువైన సాయం అందించింది. ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ అబుదాబీ (ఐఐసిఎ), ఇయర్ ఆఫ్ గివింగ్ ఛారిటీలో భాగంగా పవిత్ర రమదాన్ సందర్భంగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. సోమాలియాని కరువు తీవ్రంగా వేదిస్తోంది. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు కరువు కారణంగా. ఈ నేపథ్యంలోనే తాము ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఐఐసిఎ ప్రెసిడెంట్ బావా హాజి చెప్పారు. ఇఆర్సి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అధికారి అబ్దుల్లా ఫిదెల్ సయీద్ అల్హమెలికి ఆర్థిక సాయం అందించింది ఐఐసిఎ. పవిత్ర రమదాన్ మాసంలో సాయం చేయడం చాలా గొప్ప విషయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేషనల్ సెక్రెటరీ మరియు స్కాలర్ అబ్దుస్సమాద్ సమదాని చెప్పారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







