కరువు పీడిత సోమాలియాకి ఇండియన్ గ్రూప్ చేయూత
- June 13, 2017
కరువతో తల్లడిల్లుతున్న సోమాలియాకి యూఏఈ బేస్డ్ ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్సి) ద్వారా ఓ ఇండియన్ ఆర్గనైజేషన్ 100,000 దిర్హామ్ల విలువైన సాయం అందించింది. ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ అబుదాబీ (ఐఐసిఎ), ఇయర్ ఆఫ్ గివింగ్ ఛారిటీలో భాగంగా పవిత్ర రమదాన్ సందర్భంగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. సోమాలియాని కరువు తీవ్రంగా వేదిస్తోంది. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు కరువు కారణంగా. ఈ నేపథ్యంలోనే తాము ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఐఐసిఎ ప్రెసిడెంట్ బావా హాజి చెప్పారు. ఇఆర్సి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అధికారి అబ్దుల్లా ఫిదెల్ సయీద్ అల్హమెలికి ఆర్థిక సాయం అందించింది ఐఐసిఎ. పవిత్ర రమదాన్ మాసంలో సాయం చేయడం చాలా గొప్ప విషయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేషనల్ సెక్రెటరీ మరియు స్కాలర్ అబ్దుస్సమాద్ సమదాని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









