కరువు పీడిత సోమాలియాకి ఇండియన్ గ్రూప్ చేయూత
- June 13, 2017
కరువతో తల్లడిల్లుతున్న సోమాలియాకి యూఏఈ బేస్డ్ ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్సి) ద్వారా ఓ ఇండియన్ ఆర్గనైజేషన్ 100,000 దిర్హామ్ల విలువైన సాయం అందించింది. ఇండియన్ ఇస్లామిక్ సెంటర్ అబుదాబీ (ఐఐసిఎ), ఇయర్ ఆఫ్ గివింగ్ ఛారిటీలో భాగంగా పవిత్ర రమదాన్ సందర్భంగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. సోమాలియాని కరువు తీవ్రంగా వేదిస్తోంది. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు కరువు కారణంగా. ఈ నేపథ్యంలోనే తాము ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు ఐఐసిఎ ప్రెసిడెంట్ బావా హాజి చెప్పారు. ఇఆర్సి చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అధికారి అబ్దుల్లా ఫిదెల్ సయీద్ అల్హమెలికి ఆర్థిక సాయం అందించింది ఐఐసిఎ. పవిత్ర రమదాన్ మాసంలో సాయం చేయడం చాలా గొప్ప విషయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేషనల్ సెక్రెటరీ మరియు స్కాలర్ అబ్దుస్సమాద్ సమదాని చెప్పారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









